బాబుని కక్షపూరితంగా ఇరికించారు: ధూళిపాళ్ల
ABN , First Publish Date - 2023-09-26T04:46:07+05:30 IST
ప్రభుత్వం కక్షపూరితంగా స్కిల్ డెవల్పమెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఇరికించిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల

పొన్నూరుటౌన్, సెప్టెంబరు 25: ప్రభుత్వం కక్షపూరితంగా స్కిల్ డెవల్పమెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఇరికించిందని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆరోపించారు. ప్రభుత్వం వాస్తవాలను పక్కన పెట్టి అసత్యాలను ప్రచారం చేస్తోందన్నారు. లక్షలాది మంది విద్యార్థులు స్కిల్ డెవల్పమెంట్ ద్వారా శిక్షణ పొందితే కళ్లుండీ చూడలేని మంత్రులు దుష్ప్రచారానికి పాల్పడ్డారని, మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్రెడ్డి అధికారులపై ఒత్తిడి తెచ్చి లోకేశ్, చంద్రబాబుల పేర్లు చేర్చాలని బలవంతం చేశారని ఆరోపించారు.