పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం

ABN , First Publish Date - 2023-01-27T07:49:59+05:30 IST

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి ఆలయం వద్ద పెను అగ్ని ప్రమాదం సంభవించింది.

పెనుగంచిప్రోలు అమ్మవారి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం

జగ్గయ్యపేట : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం పరిధిలోని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ తల్లి ఆలయం వద్ద పెను అగ్ని ప్రమాదం సంభవించింది. పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న బొమ్మల దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అది కాస్తా పక్కనే ఉన్న దుకాణాలకు సైతం మంటలు అంటుకోవడంతో 50 లక్షల రూపాయల విలువైన 19 బొమ్మల దుకాణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదం ఎలా జరిగిందని పోలీసులు ఆరా తీస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందా? లేదంటే వేరే ఏదైనా కారణముందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Updated Date - 2023-01-27T07:50:01+05:30 IST