అందరికీ బదిలీ అవకాశం కల్పించాలి

ABN , First Publish Date - 2023-06-02T04:48:51+05:30 IST

గ్రామ, వార్డ్‌ సచివాలయ ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు గుడి నాగరాజు ఒక ప్రకటనలో డిమాండ్‌

అందరికీ బదిలీ అవకాశం కల్పించాలి

● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం

అమరావతి, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డ్‌ సచివాలయ ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశం కల్పించాలని ఆ సంఘం రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు గుడి నాగరాజు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం మే 25 తేదీ లోపు రెగ్యులర్‌ అయిన వారికి మాత్రమే అనుమతి ఇచ్చారని, అయితే రెగ్యులర్‌ కావడానికి అన్ని అర్హతలూ ఉన్న 5 వేల మందిని రెగ్యులరైజ్‌ చేయకపోవడంతో వారికి బదిలీ అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్‌ జారీచేసి జూన్‌ 3వ తేదీ నాటికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ప్రకటించారని, అయితే సాంతికేక కారణాలతో ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు.

Updated Date - 2023-06-02T04:48:51+05:30 IST