తిరుమల ఘాట్లో ఆగని ప్రమాదాలు
ABN , First Publish Date - 2023-06-01T05:34:42+05:30 IST
తిరుమల ఘాట్రోడ్లలో ప్రమాదాలు ఆగడం లేదు. బుధవారం రాత్రి 7గంటలకు మొదటి ఘాట్రోడ్డులోని చివరి మలుపు వద్ద ఓ జీపు రక్షణ గోడను ఢీకొంది. ఉదయం ఓ
● మళ్లీ వేగ నిబంధన
తిరుమల, మే 31 (ఆంధ్రజ్యోతి): తిరుమల ఘాట్రోడ్లలో ప్రమాదాలు ఆగడం లేదు. బుధవారం రాత్రి 7గంటలకు మొదటి ఘాట్రోడ్డులోని చివరి మలుపు వద్ద ఓ జీపు రక్షణ గోడను ఢీకొంది. ఉదయం ఓ టెంపో ట్రావెలర్ తిరుమల నుంచి వస్తూ మాల్వాడి గుండం వద్ద కొండను ఢీకొంది. అదృష్టవశాత్తూ ఈ రెండు ప్రమాదాల్లో ఎవరూ గాయపడలేదు. ఇదిలాఉండగా, తిరుమల ఘాట్ రోడ్లలో వరుస ప్రమాదాల నేపథ్యంలో టీటీడీ తిరిగి వేగ నిబంధనను నుంచి అమల్లోకి తెచ్చింది. తిరుపతి నుంచి తిరుమలకు 28 నిమిషాలు, తిరుమల నుంచి తిరుపతికి 40 నిమిషాల ప్రయాణ సమయం నిబంధనగా పెట్టారు. మంగళవారం నుంచి నిబంధనను అమలు చేస్తున్నారు.