నేడు జిల్లా బంద్‌

ABN , First Publish Date - 2023-09-11T00:22:03+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో కోరారు.

నేడు జిల్లా బంద్‌

నేడు జిల్లా బంద్‌

మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

అనంతపురం, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం అన్నివర్గాలు స్వచ్ఛంద బంద్‌ పాటించాలని కోరారు. 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ నాయకుడు, 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు ధోరణిని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ సంయమనం పాటిస్తూ శాంతియుతంగా బంద్‌ పాటించి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-11T00:22:03+05:30 IST