Share News

Dhulipalla Narendra: వైసీపీ గ్రావెల్ మాఫియాపై ధూళిపాళ్ళ పోరాటం

ABN , Publish Date - Dec 26 , 2023 | 07:36 AM

పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ గ్రావెల్ మాఫియాపై ధూళిపాళ్ళ నరేంద్ర పోరాటం చేస్తున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాపై నేటి నుంచి మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర 2 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ప్రజాపోరాటం పేరుతో పొన్నూరు నియోజకవర్గంలో 24 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు.

Dhulipalla Narendra: వైసీపీ గ్రావెల్ మాఫియాపై ధూళిపాళ్ళ పోరాటం

గుంటూరు: పొన్నూరు నియోజకవర్గంలో వైసీపీ గ్రావెల్ మాఫియాపై ధూళిపాళ్ళ నరేంద్ర పోరాటం చేస్తున్నారు. గ్రావెల్ అక్రమ రవాణాపై నేటి నుంచి మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర 2 రోజుల పాటు పాదయాత్ర నిర్వహించారు. ప్రజాపోరాటం పేరుతో పొన్నూరు నియోజకవర్గంలో 24 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించనున్నారు.

అక్రమ గ్రావెల్ తవ్వకాలకు కేంద్రంగా మారిన శేకూరు, వీరనాయకుని పాలెం, శెలపాడు,వేజెండ్ల, సుద్దపల్లి, చేబ్రోలు, వడ్లమూడి గ్రామాల మీదుగా పాదయాత్ర సాగనుంది. మైనింగ్ దోపిడీ కారణంగా పర్యావరణ నష్టంపై, ప్రాణాలు తీస్తున్న వైనంపై, రోడ్ల విధ్వంసంపై గళమెత్తేలా ధూళిపాళ్ల పాదయాత్ర నిర్వహించనున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పి, అక్రమార్కులపై చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని దూళిపాళ్ల నరేంద్ర పేర్కొన్నారు. నాటి ఓఎంసీ(ఓబులాపురం మైనింగ్ కంపెనీ) స్థాయిలో నేడు కేఎంసీ(కిలారు మైనింగ్ కంపెనీ)లో అక్రమాలు అంటూ ఆరోపిస్తున్నారు.

Updated Date - Dec 26 , 2023 | 07:36 AM