ఇనాం భూములపై స్పష్టతిచ్చిన రెవెన్యూ
ABN , First Publish Date - 2023-07-21T03:10:23+05:30 IST
ఇనాం భూములపై రెవెన్యూ శాఖ స్పష్టతనిచ్చింది. ఇనాం భూములపై లోగడ ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లవంటూ 2013లో తీసుకొచ్చిన చట్ట సవరణ గ్రామ ,,
అమరావతి, జూలై 20(ఆంధ్రజ్యోతి): ఇనాం భూములపై రెవెన్యూ శాఖ స్పష్టతనిచ్చింది. ఇనాం భూములపై లోగడ ఇచ్చిన రైత్వారీ పట్టాలు చెల్లవంటూ 2013లో తీసుకొచ్చిన చట్ట సవరణ గ్రామ సర్వీసు ఇనాం, వృత్తిదారులకు ఇచ్చిన ఇనాం భూములకు వర్తించదని స్పష్టతనిస్తూ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీ సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 1.61లక్షల ఎకరాలు నిషేధ జాబితా నుంచి బయటకు రానున్నాయి.