శ్రీవారికి ‘చిట్టిముత్యాలు’ బియ్యం
ABN , First Publish Date - 2023-03-07T03:54:58+05:30 IST
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడికి చెందిన సుబ్రహ్మణ్య కృష్ణంరాజు 122 బస్తాల బియ్యాన్ని కానుకగా పంపారు.
కాకినాడ జిల్లా భక్తుని కానుక
ప్రత్తిపాడు, మార్చి 6: తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామికి కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం గజ్జెనపూడికి చెందిన సుబ్రహ్మణ్య కృష్ణంరాజు 122 బస్తాల బియ్యాన్ని కానుకగా పంపారు. ప్రకృతి వ్యవసాయ సాగు ద్వారా పండించిన చిట్టి ముత్యాలు ధాన్యాన్ని బియ్యంగా ఆడించి 22 బస్తాల్లో వాటిని వ్యాన్లో లోడ్ చేసి సోమవారం తిరుపతికి పంపే ఏర్పాట్లు చేశారు.