Share News

మోదీ ‘లైఫ్‌ మిషన్‌’కు నోడల్‌ అధికారిగా చంద్రశేఖరరెడ్డి

ABN , Publish Date - Dec 18 , 2023 | 02:57 AM

రాష్ట్రానికి చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎ్‌సఎల్‌) పూర్వ సీఈవో ఏ.చంద్రశేఖరరెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ మానసపుత్రికగా పేర్కొనే ‘లైఫ్‌ మిషన్‌’ కార్యక్రమానికి నోడల్‌ అధికారిగా నియమించారు.

మోదీ ‘లైఫ్‌ మిషన్‌’కు నోడల్‌ అధికారిగా చంద్రశేఖరరెడ్డి

అమరావతి, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి చెందిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎ్‌సఎల్‌) పూర్వ సీఈవో ఏ.చంద్రశేఖరరెడ్డిని ప్రధాని నరేంద్ర మోదీ మానసపుత్రికగా పేర్కొనే ‘లైఫ్‌ మిషన్‌’ కార్యక్రమానికి నోడల్‌ అధికారిగా నియమించారు. విద్యుత్తు రంగంలో సంస్కరణల్లో భాగంగా ప్రధాని చేపట్టిన లైఫ్‌ మిషన్‌కు విస్తృత ప్రాచుర్యం కల్పించే బాధ్యత ఆయనది. అలాగే, చంద్రశేఖరరెడ్డిని జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక సంస్థ బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) దక్షిణప్రాంత సీనియర్‌ సలహాదారుగా కూడా నియమించుకుంది. ఈ మేరకు ఢిల్లీలో ఆదివారం చంద్రశేఖరరెడ్డికి బీఈఈ కార్యదర్శి దేవర సమక్షంలో నియామకపత్రాన్ని డైరెక్టర్‌ జనరల్‌ అభయ్‌ భాక్రే అందజేశారు.

Updated Date - Dec 18 , 2023 | 02:57 AM