సెంటులో సమాధి నిర్మించుకో

ABN , First Publish Date - 2023-06-01T05:31:40+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇస్తున్న సెంటు స్థలాలను చంద్రబాబు సమాధులతో పోల్చడం దుర్మార్గమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా

సెంటులో సమాధి నిర్మించుకో

నీ కొలతకు సరిపోతుందో లేదో చూసుకో

చంద్రబాబుపై స్పీకర్‌ మండిపాటు

పొందూరు, మే 31: రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో పేదలకు ఇస్తున్న సెంటు స్థలాలను చంద్రబాబు సమాధులతో పోల్చడం దుర్మార్గమని స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరులోని వలంటీర్ల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు చేసిన పెత్తందారీ మనస్థత్వం కలిగిన చంద్రబాబుకు పేదల కష్టాలు ఏమి తెలుసు? అమరావతిలో సెంటు స్థలంలో సమాధిని నిర్మించి.. నీ కొలతకు సరిపోతుందో లేదో చూసుకో..’’ అంటూ స్పీకర్‌ తమ్మినేని, చంద్రబాబుకు సూచించారు.

Updated Date - 2023-06-01T05:31:40+05:30 IST