తొమ్మిదేళ్ల పాలనపై బీజేపీ ప్రచారం

ABN , First Publish Date - 2023-06-01T05:18:26+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ జాతీయ

తొమ్మిదేళ్ల పాలనపై బీజేపీ ప్రచారం

విస్తృత ప్రచార ప్రణాళికతో సిద్ధమైన ‘కమలం’

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ తొమ్మిదేళ్ల పాలనా విజయాలను రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేయడానికి ఆ పార్టీ నిర్ణయించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నద్దా అదేశాల మేరకు విజయవాడలో పార్టీ నేతలు సమావేశమయ్యారు. ఈ నెల 31 నుంచి జూన్‌ 30 వరకూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1,000 మంది ప్రభావిత వ్యక్తుల వద్దకు వెళ్లి వివరించాలని నిర్ణయించారు. అసెంబ్లీ నియోజక వర్గాల్లో బైకు ర్యాలీలు, సంయుక్త మోర్చాల సమ్మేళనాలు, గ్రామాల్లో రాత్రి బసలు, మండల స్థాయిలో మోదీ మిత్ర తదితర కార్యక్రమాలు చేపట్టేందుకు రాష్ట్ర బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసుకుని కార్యక్షేత్రంలోకి దిగింది. మోదీ పాలనపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేశ్‌ నాయుడు మాట్లాడుతూ... ‘‘దేశ సర్వతోముఖాభివృద్ధికి, ప్రతి భారతీయుడి శ్రేయస్సుకు ప్రధాని చూపుతోన్న చొరవ, చేస్తున్న ప్రయత్నాలను ప్రపంచం మొత్తం గుర్తించి గౌరవిస్తోంది. ప్రతి భారతీయుడు మేరా భారత్‌ మహాన్‌ అని గర్వంగా చెప్పుకొనే స్థితిలో మన దేశాన్ని నిలిపిన నరేంద్ర మోదీని ఆసాధారణ పాలకుడిగా ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి. దేశ ప్రధానిగా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయంలోనూ ప్రజా సంక్షేమం, దేశ ప్రయోజనం కనిపిస్తుంది’’ అని అన్నారు.

Updated Date - 2023-06-01T05:18:26+05:30 IST