సీబీఐ కోర్టులో భాస్కర్రెడ్డి బెయిల్ పిటిషన్
ABN , First Publish Date - 2023-06-02T04:43:42+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి గురువారం
హైదరాబాద్, జూన్ 1(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన కడప ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్రెడ్డి గురువారం సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు వివిధ అనారోగ్య సమస్యలతో పాటు తన భార్యకు ఆరోగ్యం సరిగా లేదని పేర్కొన్నారు. దాదాపు 45 రోజులుగా జైలులో ఉంటున్నానని, ఇప్పటికే కస్టడీ విచారణ కూడా ముగిసిన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్పై త్వరలో విచారణ జరగనుంది. వివేకా హత్య కేసులో ఏప్రిల్ 16న భాస్కర్రెడ్డిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.