అప్పుల ఊబిలో రాష్ట్రం : సీపీఎం
ABN , First Publish Date - 2023-11-06T23:34:44+05:30 IST
రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పీ మధు అన్నారు. ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్ర సోమవారం పట్టణంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగులకు నష్టం కలిగించేలా జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. రా
కోవూరు, నవంబరు6: రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పీ మధు అన్నారు. ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్ర సోమవారం పట్టణంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్మోహన్రెడ్డి అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగులకు నష్టం కలిగించేలా జీపీఎస్ విధానాన్ని తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను కూడా స్ధాపించలేకపోయా రన్నారు. ఒక్క ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోయారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో వామపక్ష పార్టీలకు విజయాన్ని చేకూర్చాలని కోరారు. ఈ యాత్రలో సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, నాయకులు జొన్నలగడ్డ వెంకమరాజు, గోని దయాకరరావు, తుళ్ళూరు గోపాల్, గండవరపు శేషయ్య, కత్తి శ్రీనివాసులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.