AP News: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

ABN , First Publish Date - 2023-09-14T14:41:35+05:30 IST

ఏపీ రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.

AP News: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ

కృష్ణా జిల్లా: ఏపీ రెవెన్యూ సర్వీసెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు (AP Revenue Services State Executive Committee Election) నోటిఫికేషన్ జారీ అయ్యింది. సెప్టెంబర్ 30న విజయవాడలోని ఏపీ రెవెన్యూ భవన్‌లో రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక జరుగనుంది. మొత్తం 30 పోస్టులకు ఎన్నిక నిర్వహించనున్నారు. ఈ మేరకు ఎన్నికల అధికారి పీవీ కృష్ణారావు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలో రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ.. గత 60 యేళ్లుగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఎన్నిక నిర్వహణ తేదీ మరుసటి రోజు రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఉంటుందన్నారు. అక్టోబర్ 1న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో 17వ కౌన్సిల్ సమావేశం ఉంటుందన్నారు. సెప్టెంబర్ 30 ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుందున్నారు. ఎన్నిక అనివార్యమైతే 4 గంటల తర్వాత పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే 26 జిల్లాల కార్యవర్గాల ఎన్నికలు పూర్తి చేశామన్నారు. ప్రతి జిల్లా నుంచి ఒకరికి రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పిస్తామన్నారు. తొలిసారిగా రాష్ట్ర కార్యవర్గంలో మహిళలకు ఆరు పోస్టులు రిజర్వ్‌ చేశామని చెప్పారు. అటెండర్ క్యాడర్ నుంచి ఒకరికి, డ్రైవర్ క్యాడర్ నుంచి ఒకరికి స్థానం కల్పించనున్నట్లు బొప్పరాజు వెల్లడించారు.

Updated Date - 2023-09-14T14:41:35+05:30 IST