రెండు వాహనాలు ఢీ.. ముగ్గురు వలస కూలీలుమృతి
ABN , First Publish Date - 2023-06-26T03:47:27+05:30 IST
రెండు వాహనాలు ఢీ.. ముగ్గురు వలస కూలీలుమృతి
కోడుమూరు, జూన్ 25: బతుకుతెరువు కోసం వలస వెళుతున్న కూలీల వాహనం ప్రమాదానికి గురికావడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కర్నూ లు జిల్లా కోడుమూరులో ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన చోసుకుంది. కర్నూలు జిల్లా హొళగుంద, ఆలూరు మండలాలకు చెందిన 16 మంది వలస కూలీలు పనుల నిమిత్తం ట్రాలీ బొలేరో వాహనంలో హైదరాబాదు బయలుదేరారు. కోడుమూరు సమీపంలోని పెట్రోల్ బంకు దగ్గరకు రాగానే కర్నూలు నుంచి అతివేగంగా వస్తున్న ఐచర్ వాహనం ఢీ కొట్టింది. దీంతో బొలేరో వాహనంలోని హొళగుంద మండలం కొత్తపేట గ్రామానికి చెందిన ముత్తయ్య (33), హెబ్బటం గ్రామానికి చెందిన మల్లయ్య(34) అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 14 మందిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆలూరు మండలం కురుకుంద గ్రామానికి చెందిన బాలయ్య గారి వీరష్ (41) మృతి చెందాడు. మద్యం తాగి ప్రమాదానికి కారణమైన ఐచర్ డ్రైవర్ నరసప్పను కోడుమూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.