సీఎం చెప్పారంటే... చేయరంతే: రఘురామరాజు

ABN , First Publish Date - 2023-06-09T05:26:00+05:30 IST

మాట తప్పను.. మడమ తిప్పని విశ్వసనీయత తనదని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏదైనా చెప్పారంటే అసలు చేయబోరని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు.

సీఎం చెప్పారంటే... చేయరంతే: రఘురామరాజు

న్యూఢిల్లీ, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): మాట తప్పను.. మడమ తిప్పని విశ్వసనీయత తనదని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఏదైనా చెప్పారంటే అసలు చేయబోరని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఇచ్చిన హామీలు ఏవీ కూడా అమలు చేయకుండానే 98.7 శాతం హామీలను అమలు చేసినట్లుగా జగన్మోహన్‌ రెడ్డి పేర్కొనడం చూస్తే.. ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నమేనని అన్నారు. గురువారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ గ్యారెంటీ లేని ఒక పెన్షన్‌ స్కీమును తీసుకువచ్చి గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగుల జీతాల నుంచి 10 శాతం మొత్తాన్ని కట్‌ చేస్తున్న ప్రభుత్వం.. తాను జమ చేయాల్సిన 10 శాతం నిధులను గత మూడు నెలలుగా జమ చేయడం లేదని చెప్పారు. ఈ నిధిని కూడా ఇతర అవసరాలకు తరలించినట్లుగా అనుమానాలు ఉన్నాయన్నారు.

Updated Date - 2023-06-09T05:26:00+05:30 IST