అభివృద్ధిని గాలికొదిలేసిన సీఎం జగన్
ABN , First Publish Date - 2023-06-26T03:58:48+05:30 IST
అభివృద్ధిని గాలికొదిలేసిన సీఎం జగన్
కేంద్ర మంత్రి దేవ్సింగ్ చౌహాన్
తిరుపతి(కొర్లగుంట), జూన్ 25: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఏపీ అభివృద్ధిని గాలికొదిలేశారని కేంద్రమంత్రి దేవ్సింగ్చౌహాన్ విమర్శించారు. ప్రధాని మోదీ తొమ్మిదేళ్ల పాలనలో సేవ-సుపరిపాలన-పేదల సంక్షేమ అనే అంశంపై ఆదివారం తిరుపతి న్యూబాలాజీ కాలనీలోని ఓ స్కూలు ఆవరణలో జరిగిన మేధావుల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. జగన్ది నియంతృత్వ పాలన అని, జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. స్మార్ట్సిటీ తదితర 87ప్రాజెక్టుల కోసం రూ.1,680కోట్లు మంజూరు చేశామని, కేంద్ర నిధులతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, వైసీపీ ప్రభుత్వం బీజేపీ గురించి చెప్పకుండా తన మార్కు స్టిక్కర్లతో ఊరేగుతోందని ఆగ్రహించారు. మోదీ పాలనను విమర్శించే అర్హత రాహుల్కు లేదని అన్నారు.