Share News

Krishna: గన్నవరంలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు స్టూడెంట్స్ మృతి

ABN , First Publish Date - 2023-11-19T19:40:12+05:30 IST

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు(Students) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన అంకిత్(15), శశివర్దన్(14) ఫొటో షూట్ నిమిత్తం గన్నవరం మండలం సావరగూడెనికి వచ్చారు.

Krishna: గన్నవరంలో విషాదం.. చెరువులో పడి ఇద్దరు స్టూడెంట్స్ మృతి

కృష్ణా: కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు(Students) మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన అంకిత్(15), శశివర్దన్(14) ఫొటో షూట్ నిమిత్తం గన్నవరం మండలం సావరగూడెనికి వచ్చారు.

సావరగూడెం శివరాం కొండ చెరువు వద్దకు చేరుకుని ఒడ్డుకు నిల్చొని ఫొటోలు దిగుతున్నారు. ఈ క్రమంలో పొరపాటున కాలు జారి చెరువులో పడిపోయారు. ఈత రాక నీట మునిగి విద్యార్థులు చనిపోయారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - 2023-11-19T19:40:13+05:30 IST