దహీ తడ్కా
ABN , First Publish Date - 2022-04-23T22:06:44+05:30 IST
భోజనం చివర్లో పెరుగుతో తినడం అందరూ చేసేదే. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా పెరుగు వంటలు చేసుకుని తినడం వల్ల ఒంటికి చల్లదనం
వీటితో... చల్లదనం పెరుగు
భోజనం చివర్లో పెరుగుతో తినడం అందరూ చేసేదే. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న రోజుల్లో ప్రత్యేకంగా పెరుగు వంటలు చేసుకుని తినడం వల్ల ఒంటికి చల్లదనం చేకూరుతుంది. పెరుగుతో చేసే అలాంటి కొన్ని వంటలు ఇవి...
కావలసినవి: పెరుగు - మూడు కప్పులు, ఉల్లిపాయలు - రెండు, టొమాటో - ఒకటి, ఆవాలు - ఒక టీస్పూన్, కారం - ఒక టీస్పూన్, పసుపు - అర టీస్పూన్, కరివేపాకు - రెండు రెమ్మలు, కొత్తిమీర - ఒకకట్ట, పచ్చిమిర్చి - రెండు, గరంమసాల - ఒకటీస్పూన్, ఎండుమిర్చి - రెండు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.స్టవ్పై పాన్ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు వేసి వేయించాలి.స్టవ్పై పాన్ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు వేసి వేయించాలి.
తయారీ: స్టవ్పై పాన్ పెట్టి కాస్త నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు వేసి వేయించాలి. పసుపు, ఉప్పు, కారం, గరంమసాల, కరివేపాకు వేసి మరో నిమిషం పాటు వేయించుకోవాలి.తరువాత ఉల్లిపాయలు, టొమాటో, పచ్చిమిర్చి వేయాలి. మసాలా చిక్కగా అయ్యే వరకు వేయించాలి. చివరగా పెరుగు వేసి కలుపుకోవాలి. ఎండుమిర్చిని దంచి చల్లుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేయాలి.