రేపటి నుంచి షర్మిల ‘ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మొదలు
ABN , First Publish Date - 2022-03-10T18:36:41+05:30 IST
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది.
హైదరాబాద్: వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ‘‘ప్రజాప్రస్థానం’’ పాదయాత్ర రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభంకానుంది. నల్గొండ జిల్లా కొండపాక గూడెం నుంచి పాదయాత్రను షర్మిల మొదలు పెట్టనున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు లోటస్ పాండ్ నుంచి భారీ కాన్వాయ్లో వైఎస్సార్టీపీ అధినేత్రి కొండపాక గూడెంకు చేరుకోనున్నారు. శుక్రవారం కొండపాక గూడెం నుంచి నార్కట్ పల్లి వరకు 5 కిలేమేటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు. అనంతరం సాయంత్రం నార్కట్ పల్లిలో భారీ భహిరంగ సభలో షర్మిల పాల్గొని ప్రసంగించనున్నారు.