Yadadriలో కల్తీపాల కలకలం
ABN , First Publish Date - 2022-06-03T19:50:15+05:30 IST
జిల్లాలో కల్తీపాల కలకలం రేగింది. భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్ పరిధిలో గల కల్తీపాల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు.
యాదాద్రి: జిల్లాలో కల్తీపాల కలకలం రేగింది. భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్ పరిధిలో గల కల్తీపాల తయారీ కేంద్రాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. రైతుల వద్ద స్వచ్ఛమైన పాలను కొనుగోలు చేసి కల్తీ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. రంగు, చిక్కదనం కోసం ప్రమాదకర రసాయన పదార్థాలు వినియోగిస్తున్నట్టు నిర్ధారణ అయ్యింది. కల్తీ పాలను హైదరాబాద్లోని హోటల్స్, రెస్టారెంట్స్, టీ స్టాల్స్కు విక్రయిస్తున్నట్టు అధికారుల విచారణలో నిజం వెల్లడైంది. పాల శాంపిల్స్ సేకరించిన అధికారులు ల్యాబ్కు పంపించారు. రిపోర్ట్స్ అనంతరం అక్రమార్కులపై చర్యలకు ఫుడ్ సేఫ్టీ అధికారులు సిద్ధమవుతున్నారు.