రాజ్భవన్లో మహిళా దర్బార్...సమస్యలు వింటున్న Governor
ABN , First Publish Date - 2022-06-10T18:29:00+05:30 IST
రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన మహిళా దర్బార్ శుక్రవారం రాజ్భవన్లో ప్రారంభమైంది.
హైదరాబాద్: రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్వహించిన మహిళా దర్బార్ శుక్రవారం రాజ్భవన్లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహిళలు చెబుతున్న సమస్యలను గవర్నర్ వింటున్నారు. ప్రజాదర్బార్ కోసం 300 మంది మహిళలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. నేరుగా రాజ్భవన్కు వచ్చిన మహిళలకు కూడా అనుమతి ఇవ్వడం జరిగింది.