ఏపీ ఉద్యోగులు మనకొద్దు

ABN , First Publish Date - 2022-12-21T04:09:50+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1800 మంది ఉద్యోగులను శాశ్వతంగా తెలంగాణకు బదిలీచేయడానికి సంబంధించిన లిస్టును ...

ఏపీ ఉద్యోగులు మనకొద్దు

టీఎస్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌

పంజాగుట్ట, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 1800 మంది ఉద్యోగులను శాశ్వతంగా తెలంగాణకు బదిలీచేయడానికి సంబంధించిన లిస్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలంగాణ ప్రభుత్వానికి పంపించారని, ఏపీ ఉద్యోగులు వద్దు, స్థానిక యువతకే ఉద్యోగావకాశాలు కల్పించాలని టీఎస్‌ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ డిమాండ్‌ చేసింది. ఏపీ ఉద్యోగులు 1800 మందిని శాశ్వతంగా తెలంగాణకు బదిలీ చేేస్త ఇక్కడి ఉద్యోగులకు పదోన్నతులు రావని, ఇక్కడి యువత నష్టపోతారని ఫెడరేషన్‌ చైర్మన్‌ బాలకృష్ణ పేర్కొన్నారు. డిప్యూటేషన్‌పై పనిచేస్తున్న ఆంధ్ర ప్రాంత ఉద్యోగులను తిరిగి వారి ప్రాంతానికి పంపించాలని కోరారు.

Updated Date - 2022-12-21T04:09:52+05:30 IST