Warangal Dist.: 222వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

ABN , First Publish Date - 2022-11-27T10:41:50+05:30 IST

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) చేపట్టిన పాదయాత్ర (Padayatra) 222వ రోజు ఆదివారం వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది.

Warangal Dist.: 222వ రోజు కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర

వరంగల్ (Warangal): వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల (Sharmila) చేపట్టిన పాదయాత్ర (Padayatra) 222వ రోజు ఆదివారం వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గంలో కొనసాగుతోంది. నల్లబెల్లి నైట్ క్యాంప్ నుంచి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఈ రోజు కొండ అయిలోని పల్లి, రాంనగర్, చంద్రయ్యపల్లి, బానోజిపేట, నర్శనాయక్ తండా, మాదన్న పేట మీదుగా నర్సంపేట టౌన్‌కు పాదయాత్ర చేరుకోనుంది. నేటితో ఆమె పాదయాత్ర 3500 కీ.మీ. మైలు రాయి దాటనుంది. ఈ సందర్భంగా షర్మిల నర్సంపేటలో వైఎస్సార్ పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తర్వాత మహేశ్వరం, రాములు నాయక్ తండా మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది.

Updated Date - 2022-11-27T10:41:54+05:30 IST