Warangal జిల్లా మొగిలిచర్లలో తీవ్ర ఉద్రిక్తత..

ABN , First Publish Date - 2022-06-15T20:57:44+05:30 IST

Warangal జిల్లా: మొగిలిచర్ల (Mogilicharla)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Warangal జిల్లా మొగిలిచర్లలో తీవ్ర ఉద్రిక్తత..

Warangal జిల్లా: మొగిలిచర్ల (Mogilicharla)లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల (Farmers) భూముల నుంచి విద్యుత్ హైటెన్షన్ లైన్ల నిర్మాణానికి అధికారులు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకోడానికి రైతులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. రైతుల భూముల నుంచి విద్యుత్ హైటెన్షన్ లైన్లు వేయడానికి కొంత కాలంగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. దీనిని రైతులు అడ్డుకుంటున్నారు.


నిన్న గ్రామానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగి వెళ్లిపోయారు. మళ్లీ బుధవారం ఉదయం పోలీసుల సహాయంతో గ్రామానికి వచ్చారు. తమ భూముల్లో విద్యుత్ హైటెన్షన్ వైర్లు వేయడానికి ఒప్పుకునేది లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూముల్లోకి ఎలా ప్రవేశిస్తారని పోలీసులతో వాదనకు దిగారు. వ్యవసాయమే ఆధారంగా బతికే తమ భూముల్లో హైటెన్షన్ వైర్లు వేయడం ఏంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపరిహారం ఇస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ విషయం తమ వరకు రాలేదని, పోలీసులతో కుమ్మక్కయి తమ భూముల్లో అక్రమంగా విద్యుత్ వైర్ల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2022-06-15T20:57:44+05:30 IST