వర్ధన్నపేటలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
ABN , First Publish Date - 2022-04-14T16:20:03+05:30 IST
జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
వరంగల్: జిల్లాలోని వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. స్థానిక శాసనసభ్యులు అరూరి రమేష్ పూలమాల వేసిన తర్వాతే బీజేపీ వాళ్ళు పూలమాలలు వేయాలని టీఆర్ఎస్ నేతలు హుకుం జారీ చేశారు. దీంతో ఎమ్మెల్యే ఆరూరి రాకకోసం బీజేపీ నాయకులు గంటపాటు ఎదురుచూశారు. ఎంతకూ ఎమ్మెల్యే రాకపోవడంతో పూలమాలలు వేసేందుకు బీజేపీ సిద్ధమవగా... వద్దని టీఆర్ఎస్ నాయకులు వారించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు నచ్చజెప్పేందుకు యత్నిస్తున్నారు.