Expired KCR కిట్ల పంపిణీపై విజయశాంతి ఫైర్..
ABN , First Publish Date - 2022-05-18T02:37:09+05:30 IST
Expired KCR కిట్ల పంపిణీపై విజయశాంతి ఫైర్..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కిట్లలో ఎక్స్పైరీ అయిన వస్తువులు పంపిణీ అవుతున్నాయని, వాటినే బాలింతలకు అందజేస్తున్నారని మండిపడ్డారు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ బాలింతకు ఇచ్చిన కిట్లో అన్ని వస్తువులూ ఎక్స్పైరీ అయినవే ఉన్నాయని ఆమె ఆరోపించారు. ఇంటికెళ్లిన తర్వాత ఎక్స్పైరీ డేట్ చూసి కంగుతిన్న కుటుంబ సభ్యులు, తిరిగి వాటిని ఆస్పత్రికి తీసుకొచ్చి ఇచ్చేశారని విజయశాంతి తెలిపారు. రాములమ్మ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు యథాతథంగా..
''కేసీఆర్ కిట్లలో ఎక్స్పైరీ అయిన వస్తువులు పంపిణీ అవుతున్నయి. వాటినే బాలింతలకు అందజేస్తున్నరు. రెండ్రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ బాలింతకు ఇచ్చిన కిట్లో అన్ని వస్తువులూ ఎక్స్పైరీ అయినవే ఉన్నయి. ఇంటికెళ్లిన తర్వాత ఎక్స్పైరీ డేట్ చూసి కంగుతిన్న కుటుంబ సభ్యులు, తిరిగి వాటిని హాస్పిటల్కు తీసుకొచ్చి ఇచ్చేశారు. అందులో 2020 ఆగస్టులోనే ఎక్స్పైర్ అయిన బేబీ పౌడర్, 2021 ఆరో నెలలో ఎక్స్పైర్ అయిన బేబీ ఆయిల్, అదే ఏడాది ఏడో నెలలో ఎక్స్పైర్ అయిన బేబీ సోప్స్, తొమ్మిదో నెలలో ఎక్స్పైర్ అయిన బేబీ షాంపు ఉన్నయి. దీంతో మెడికల్ ఆఫీసర్లు గుట్టుచప్పుడు కాకుండా ఆ వ్యక్తికి మరో కిట్ ఇచ్చి పంపించారు. పైగా ఈ వ్యవహారాన్నిలైట్ తీసుకోవాలని చెప్పారని... విషయం బయటకు తెలిస్తే చర్యలు తప్పవనీ... హెచ్చరించారు. కేసీఆర్ కిట్ల కొనుగోలు, పంపిణీపై అధికారుల పర్యవేక్షణ కొరవడడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నయని హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు చెబుతున్నరు. కేసీఆర్... పథకానికి నీపేరు పెట్టుకుంటే సరిపోదు. దాని అమలు తీరును కూడా పట్టించుకోవాలి. ఎక్స్పైరీ అయిన వస్తువులు పంపిణీ చేస్తున్న కేసీఆర్ సర్కార్కి కూడా త్వరలోనే ఎక్స్పైరీ డేట్ రానుంది.'' అని విజయశాంతి అన్నారు.