ప్రాణాలను కాపాడుకోవడానికి బంకర్లలో తలదాచుకున్నాం..
ABN , First Publish Date - 2022-03-04T15:13:18+05:30 IST
ఉక్రెయిన్లో తామున్న ప్రాంతాల్లో రష్యా బాంబులతో దాడులు చేసేదని, ప్రాణాలను కాపాడుకోవడానికి బంకర్లలో, రైళ్లలో తలదాచుకున్నామని విద్యార్థిని రాణి తెలిపింది
ఉక్రెయిన్ నుంచి ఇంటికి..
హైదరాబాద్/ సనత్ నగర్/జీడిమెట్ల: ఉక్రెయిన్లో తామున్న ప్రాంతాల్లో రష్యా బాంబులతో దాడులు చేసేదని, ప్రాణాలను కాపాడుకోవడానికి బంకర్లలో, రైళ్లలో తలదాచుకున్నామని విద్యార్థిని రాణి తెలిపింది. ఉక్రెయిన్లో ఎంబీబీఎస్ చదువుతున్న షాపూర్నగర్లోని సంజయ్గాంధీనగర్కు చెందిన మేరీ, శేఖర్ల కుమార్తె రాణి క్షేమంగా ఇంటికి చేరడంతో ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పుష్పలత, మురళీ కుమార్తె ఎన్.కల్పన కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించారు.
నిద్రాహారాలు మాని..
యుద్ధం కారణంగా క్యాంప్సలను ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో మూడు రోజులు నిద్రాహారాలు మాని, ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ హంగేరికి చేరుకున్నామని విద్యార్థిని షమా బాధాతప్త హృదయంతో తెలిపింది. ద్వితీయ సంవత్సరం వైద్య విద్యను అభ్యసిస్తున్న సనత్నగర్ (సుందర్ నగర్)లోని అయూబ్ఖాన్ కుమార్తె షమా క్షేమంగా ఇంటికి చేరుకుంది. ఆమెను మాజీ ఎమ్మెల్యే శశిధర్రెడ్డి పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు.