TS News: మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి పని: ఎర్రబెల్లి
ABN , First Publish Date - 2022-09-19T01:22:51+05:30 IST
Hanmakonda: హనుమకొండ అంబేద్కర్ భవన్లో తెలంగాణ (Telangana) జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Yerrabelli Dayakar Rao), ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, అధి
Hanmakonda: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బీజేపీ నాయకులను విమర్శించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడమే వారి పని అని మండిపడ్డారు. హనుమకొండ అంబేద్కర్ భవన్లో తెలంగాణ (Telangana) జాతీయ సమైక్యత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Yerrabelli Dayakar Rao), ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాస్తవాలు తెలుసుకోకుండా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. సద్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం నవాబుల పాలన నుంచి విముక్తి చేసి భారతదేశంలో తెలంగాణాను విలీనం చేశారని పేర్కొన్నారు. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడింది కమ్యునిష్టులేనని పేర్కొన్నారు.