గురుకులాలకు స్థలాలు ఖరారు

ABN , First Publish Date - 2022-09-23T08:00:53+05:30 IST

గురుకులాలకు స్థలాలు ఖరారు

గురుకులాలకు స్థలాలు ఖరారు

హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేస్తున్న మహాత్మా జ్యోతిబాపూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయల నిర్మాణానికి స్థలాలు ఖరారు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తగా ఏర్పాటవుతున్న 33 గురుకుల పాఠశాలలు, 15 డిగ్రీ గురుకులాలు ఆయా జిల్లాల్లో ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా నూతన గురుకులాల ఏర్పాటు పట్ల సీఎం కేసీఆర్‌కు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌  ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్‌లో ప్రతి మండలానికి ఒక గురుకులం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-09-23T08:00:53+05:30 IST