టీఆర్ఎస్లో భగ్గుమన్న వర్గ విభేదాలు
ABN , First Publish Date - 2022-04-08T22:22:00+05:30 IST
కొత్తగూడెం టీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.
భద్రాద్రి: కొత్తగూడెం టీఆర్ఎస్లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ధాన్యం సేకరణలో మోదీ ప్రభుత్వ తీరుకు నిరసనగా టీఆర్ఎస్లోని రెండు వర్గాలు బైక్ ర్యాలీ తీశాయి.కాగా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మి స్కూటీని.. వ్యతిరేక వర్గం కౌన్సిలర్లు వెనుక నుంచి ఢీకొట్టారు.దీంతో సీతామహాలక్ష్మి స్కూటీ నుంచి కింద పడిపోయారు. సొంతపార్టీ నేతలే అవమానిస్తున్నారంటూ సీతామహాలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది.ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎదుట ఆమె కంటతడి పెట్టారు.