Congress charge sheet: టీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలపై చార్జ్షీట్ విడుదల చేసిన రేవంత్రెడ్డి
ABN , First Publish Date - 2022-09-03T21:54:30+05:30 IST
టీఆర్ఎస్, బీజేపీ (TRS BJP) వైఫల్యాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) చార్జ్షీట్ విడుదల చేశారు.
హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీ (TRS BJP) వైఫల్యాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి (Revanth Reddy) చార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, టీఆర్ఎస్వి అవకాశవాద రాజకీయాలని మండిపడ్డారు. మతం పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ వైషమ్యాలు రెచ్చగొడుతున్నాయని తప్పుబట్టారు. రజాకార్లపై పోరాటం చేసినప్పుడు బీజేపీ ఎక్కడుంది? అని రేవంత్రెడ్డి ప్రశ్నించారు. సెప్టెంబర్ 17ను కేసీఆర్ అధికారికంగా ఎందుకు నిర్వహించట్లేదని నిలదీశారు. 8 ఏళ్లుగా సీఎం కేసీఆర్ (CM KCR) ఎవరికి అమ్ముడుపోయారు? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 17 నుంచి ఏడాది పాటు వజ్రోత్సవాలు నిర్వహించేలా.. కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి (Rajagopal Reddy) కుటుంబానికి కాంగ్రెస్ ఎంతో చేసిందని తెలిపారు. మునుగోడు ప్రజలు లక్ష ఓట్లు వేసి గెలిపిస్తే.. రూ.22 వేల కోట్లకు రాజగోపాల్రెడ్డి అమ్ముడుపోయారని ఆరోపించారు. మునుగోడులో అమ్ముడుపోయే నేతలకు రూ.40 లక్షలు వచ్చాయని, అమ్ముడుపోయే నేతలకు ప్రజలే బుద్ధి చెప్పాలని రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు.