Polavaram: భద్రాచలానికి ముప్పు: మంత్రి అజయ్

ABN , First Publish Date - 2022-07-19T16:59:40+05:30 IST

పోలవరంతో తెలంగాణకు కాస్త ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవమేనని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Polavaram: భద్రాచలానికి ముప్పు: మంత్రి అజయ్

భద్రాచలం: పోలవరం(Polavaram)తో  భద్రాచలానికి (Bhadrachalam) ముప్పు ఉందని.. మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం చెబుతున్న కేంద్ర ప్రభుత్వం(Central Govt) పట్టించుకోవడం లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Ajay)  అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ఎత్తు తగ్గించేందుకు కేంద్రం బాధ్యత తీసుకోవాలని కోరారు. భద్రాచలం పక్కన ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణ ప్రభుత్వమే ఆదుకుందన్నారు.పార్లమెంట్‌లో బిల్లు పెట్టి తక్షణమే ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని  డిమాండ్ చేశారు.ఇంత వరద వస్తే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) బాధితులను కలిశారా అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి ఎవరైనా వస్తే ఉపయోగం ఉంటుందని.. గవర్నర్ భద్రాచలంలో పర్యటిస్తే ఏం ఉపయోగమని నిలదీశారు. రేవంత్‌కు ఇసుక, నోటూ... మూటలు తప్ప ఇంకా ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు పార్టీ సమావేశాలే ముఖ్యమని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు వరద బాధితులను కలిసి ఏమైనా సహాయం చేశారా అని ప్రశ్నించారు.రాజకీయాల్లో ఎవరు శాశ్వత శత్రువులు మిత్రులు ఉండరని  మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యానించారు.


వారికి శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తాం

భద్రాచలం వరద నుంచి శాశ్వత పరిష్కారానికి వెయ్యి కోట్ల రూపాయలను సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించారన్నారు. పోలవరం వల్ల గోదావరి ప్రవాహం స్లోగ వెళ్తోందన్నారు.పోలవరం ఎత్తు తగ్గించాలని గతంలో ఏపీని కోరామని చెప్పారు.సీఎం రోడ్డు మార్గాన వచ్చి వరద బాధితులను కలిసి ధైర్యం చెప్పారన్నారు. వరద బాధితులను ముంపు ప్రాంతాల నుంచి తరలించి శాశ్వత గృహాలు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను కొనసాగిస్తున్నామని మంత్రి అజయ్ చెప్పారు.

Updated Date - 2022-07-19T16:59:40+05:30 IST