TRS MLAs కొనుగోలు నిందితుల కేసు విచారణ వాయిదా
ABN , First Publish Date - 2022-11-14T12:35:54+05:30 IST
సుప్రీంకోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు నిందితుల కేసు విచారణ వాయిదా పడింది.
ఢిల్లీ : సుప్రీంకోర్టు (Supreme Courtలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు (MLAs purchase) నిందితుల కేసు విచారణ వాయిదా పడింది. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు స్థానిక కోర్టు బెయిల్ పిటిషన్పై ఉత్తర్వులు ఇవ్వబోతోందని విచారణను వాయిదా వేయాలని నిందితుల తరుఫు న్యాయవాది కోరారు. తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో హైకోర్టు రిమాండ్ను సవాల్ చేస్తూ ముగ్గురు నిందితులూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.