నేడు పల్లె, పట్టణ ప్రగతిపై సీఎం కేసీఆర్ సమీక్ష
ABN , First Publish Date - 2022-05-18T09:38:33+05:30 IST
రాష్ట్ర వ్యాప్తం గా ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనున్న సందర్భంగా ము ఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు.
5 అంశాలపై చర్చించే అవకాశం
హైదరాబాద్, మే 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తం గా ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు ఐదో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టనున్న సందర్భంగా ము ఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ప్రధానంగా బృహత్ ప్రకృతి వనాలు, పల్లె, పట్టణ ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు, వరిధాన్యం కొనుగోళ్లు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నిర్వహణపై సమీక్షించనున్నారు. అదేవిధంగా గతంలో నిర్వహించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికలపై, హరిత హారం మొక్కల పెంపకంపై చర్చించనున్నట్లు సమాచారం. ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్లో జరిగే ఈ సమావేశంలో మంత్రులు, జడ్పీ చైర్పర్సన్లు, కలెక్టర్లు, మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లు, అధికారులు పాల్గొంటారు.