బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల షెడ్యూలు ఇదీ..
ABN , First Publish Date - 2022-06-30T11:06:27+05:30 IST
మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. 3.30 గంటలకు శంషాబాద్ పట్టణం నుంచి దాదాపు 2

జూలై 1
మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. 3.30 గంటలకు శంషాబాద్ పట్టణం నుంచి దాదాపు 2 కిలోమీటర్ల మేర రోడ్షోలో పాల్గొని 4 గంటలకు హెచ్ఐసీసీ లోని నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలు, తెలంగాణ ఉద్యమం-బీజేపీ పోరాటాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను నడ్డా ప్రారంభిస్తారు.
రాత్రి 7 గంటలకు నోవాటెల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో నడ్డా సమావేశం. జాతీయ కార్యవర్గ సమావేశాల ఎజెండా, ప్రతిపాదిత తీర్మానాలపై సమీక్ష.
రాత్రి 8.30 గంటల నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు.
జూలై 2
ఉదయం 10 గంటలకు జాతీయ పదాధికారుల సమావేశం ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది.
4 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి.
బేగంపేట విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ చేరుకుంటారు. రాత్రికి రాజ్భవన్లో బస చేస్తారు.
జూలై 3
ఉదయం 10 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాల కొనసాగింపు.
సాయంత్రం 4 గంటలకు మోదీ ముగింపు ఉపన్యాసం.
4.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్లో విజయ సంకల్ప సభ. ప్రధాని మోదీ, అమిత్షా, నడ్డాతోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు పాల్గొంటారు.
జూలై 4
పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శుల సమావేశం.
ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం బయలుదేరి భీమవరం వెళతారు.