TS News: రూబీ మోటార్స్లో విద్యుత్ బైక్ల ఘటనపై కేంద్రం విచారణకు ఆదేశం
ABN , First Publish Date - 2022-09-14T18:13:55+05:30 IST
సికింద్రాబాద్లోని రూబీ మోటార్స్లో విద్యుత్ బైక్ల ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
హైదరాబాద్: సికింద్రాబాద్లోని రూబీ మోటార్స్లో విద్యుత్ బైక్ల ఘటనపై కేంద్రం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి రంగంలోకి దిగిన కేంద్ర రవాణాశాఖ వాస్తవాలు తెలుసుకునేందుకు ఇద్దరు అధికారులతో కమిటీని నియమించింది. ఈరోజు ఈ బైక్ పేలుళ్లపై విచారణ జరుగనుంది. బ్యాటరీలు ఎందుకు పేలాయి.. సరైన జాగ్రత్తలు తీసుకోలేదా అనే కోణంలో విచారణ జరుగనుంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా ఈ బైక్ బ్యాటరీలు పేలిన ఘటనపై కేంద్ర రవాణాశాఖ అప్రమత్తమైంది. కాగా.. ఈ ఘటనకు సంబంధించి పోలీసుశాఖ ఇప్పటికే ప్రాథమిక నివేదికను అందజేసింది. బ్యాటరీ పేలుళ్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
కాగా.. సికింద్రాబాద్ ఎలక్ట్రిక్ స్కూటర్ల షోరూంలో ఈనెల 12న భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవదహనం అయ్యారు. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో.. ఆ ప్రాంతంలో భారీ శబ్దాలు వచ్చాయి. చూస్తుండగానే దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్కు వ్యాపించాయి. హోటల్లో దిగిన పలువురు పొగలకు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఎనిమిది మంది సజీవదహనం అవగా... మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో హోటల్లో 25 మంది బస చేసినట్లు తెలుస్తోంది.