గులాబీ మూకపై ప్రజల తిరుగుబాటుకు సమయం ఆసన్నమైంది: రేవంత్ రెడ్డి
ABN , First Publish Date - 2022-04-19T23:44:41+05:30 IST
గులాబీ మూకపై ప్రజల తిరుగుబాటుకు సమయం ఆసన్నమైంది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అరాచకానికి రాచబాటలు వేస్తున్నారని తాను కొద్ది కాలంగా చెబుతూ వస్తున్నానని చెప్పారు. అది వాస్తవం అనడానికి ఇటీవల కేసీఆర్ ముఠా చేస్తోన్న ఈ ఆగడాలే నిదర్శనమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గులాబీ మూకపై ప్రజలు తిరుగుబాటుకు సమయం ఆసన్నమైంది, బీ రెడీ!: అంటూ ట్విటర్లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.