రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,75,443

ABN , First Publish Date - 2022-09-17T09:13:44+05:30 IST

రాష్ట్ర తలసరి ఆదాయం అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో పెరుగుదల నమోదువుతుండటంతో...

రాష్ట్ర తలసరి ఆదాయం రూ.2,75,443

ఆర్‌బీఐ నివేదిక 2021-22లో వెల్లడి

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర తలసరి ఆదాయం అనూహ్యంగా పెరుగుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎ్‌సడీపీ)లో పెరుగుదల నమోదువుతుండటంతో... అదే స్థాయిలో తలసరి ఆదాయం (పర్‌ క్యాపిటా ఇన్‌కమ్‌) కూడా పెరుగుతోంది. రాష్ట్రం అవతరించిన తొలినాళ్లలో... అంటే 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుత ధరల వద్ద రూ.1,24,104గా ఉంది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.2,75,443కు పెరిగింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గురువారం ‘భారతదేశ ఆర్థిక వ్యవస్థ 2021-22’ పేరిట విడుదల చేసిన నివేదికలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంటే... ఈ ఏడేళ్ల కాలంలో రాష్ట్ర తలసరి ఆదాయం ఏకంగా 121.94 శాతం పెరిగినట్లయింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌ తలసరి ఆదాయం 2014-15లో రూ.93,903 ఉండగా... 2021-22 నాటికి రూ.2,07,771కు పెరిగింది. ఏపీ కంటే తెలంగాణ తలసరి ఆదాయం 32.57 శాతం అధికం. ఇక జాతీయ స్థాయి సగటు తలసరి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్నా... తెలంగాణ తలసరి ఆదాయం 83.62 శాతం అధికంగా నమోదైంది. 2021-22లో జాతీయ తలసరి ఆదాయం రూ.1,50,007గా ఉంది.

Updated Date - 2022-09-17T09:13:44+05:30 IST