Charminar దగ్గర టెన్షన్ టెన్షన్
ABN , First Publish Date - 2022-06-10T21:25:17+05:30 IST
చార్మినార్ దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మహ్మద్ప్రవక్తపై నుపుర్శర్మ వ్యాఖ్యలకు నిరసనగా ముస్లింల ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్: చార్మినార్ దగ్గర టెన్షన్ టెన్షన్ నెలకొంది. మహ్మద్ప్రవక్తపై బీజేపీ మాజీ స్పోక్స్పర్సన్ నుపూర్ శర్మ వ్యాఖ్యలకు నిరసనగా ముస్లింల ఆందోళన చేపట్టారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత ముస్లింలు ర్యాలీగా బయల్దేరారు. నుపూర్శర్మ, నిత్యానంద, ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాతబస్తీలో ముస్లింల నిరసనతో భారీగా పోలీసులను మోహరించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చేశారు.