Raghunandan rao: టీఆర్‌ఎస్ మునిగిపోయే నావా..నేనెందుకు వెళ్తా?

ABN , First Publish Date - 2022-10-22T19:40:48+05:30 IST

టీఆర్ఎస్ (TRS) మునిగిపోయే నావా అని... అందులోకి తానెందుకు వెళ్తానని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రఘునందన్‌ రావు అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... నిన్న టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన వాళ్ల రిజైన్ లెటర్స్ ప్రగతి భవన్‌లోనే టైప్ అయ్యాయన్నారు.

Raghunandan rao: టీఆర్‌ఎస్ మునిగిపోయే నావా..నేనెందుకు వెళ్తా?

నల్లగొండ: టీఆర్ఎస్ (TRS) మునిగిపోయే నావా అని... అందులోకి తానెందుకు వెళ్తానని బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) రఘునందన్‌ రావు అన్నారు. శనివారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... నిన్న టీఆర్ఎస్‌లోకి వెళ్ళిన వాళ్ల రిజైన్ లెటర్స్ ప్రగతి భవన్‌లోనే టైప్ అయ్యాయన్నారు. ‘‘టీఆర్ఎస్ పార్టీ కుండకు రంద్రం కొట్టిందే నేను. నేను వెలమ కాబట్టే నాపై బురద చల్లుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్ర అపిందే నేను. బీజేపీ నుండి పోతున్నవాళ్ళు తమ అవసరాల కోసం వెళ్తున్నారు. వెళ్తున్న వాళ్ళని మేమే పంపి ఉండొచ్చు కదా?. మనుషులు టీఆర్ఎస్ లోకి వెళ్ళినా వాళ్ల మనుసులు మాత్రం మాతోనే ఉంటాయి’’ అని చెప్పుకొచ్చారు. రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడు 119 నియోజకవర్గాలను దత్తత తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ (KCR), తెలంగాణ పోలీసులు తమ ఫోన్స్ ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీలోకి వచ్చే వాళ్ల గురించి తమకంటే కేసీఆర్ (Telangana CM) దగ్గరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉందని రఘునందన్‌ రావు (bjp mla) పేర్కొన్నారు.

Updated Date - 2022-10-22T19:41:25+05:30 IST