TS News: తెలంగాణలో రేపు సెలవు
ABN , First Publish Date - 2022-09-17T01:58:52+05:30 IST
రాష్ట్రంలో రేపు (శనివారం) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు.
హైదరాబాద్: రాష్ట్రంలో రేపు (శనివారం) అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటించారు. తెలంగాణ (Telangana) జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్ (Somesh kumar) ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం హైదరాబాద్లో పబ్లిక్ గార్డెన్స్లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేస్తారు. ఆదివాసీ, బంజారాభవన్లను ప్రారంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ మైదానంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నుంచి మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రభుత్వపరంగా నిర్వహించనున్నారు. ఈ రోజు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించారు. 17న జిల్లా, మండల, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.