26 నుంచి బడులకు దసరా సెలవులు
ABN , First Publish Date - 2022-09-13T12:08:15+05:30 IST
26 నుంచి బడులకు దసరా సెలవులు
హైదరాబాద్, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ పంపించింది. వచ్చే నెల 5న దసరా పండుగ. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగనున్నాయి. పాఠశాలలు తిరిగి అక్టోబరు 10న ప్రారంభమవుతాయి.