విషాదం... కుటుంబం ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2022-11-24T21:31:53+05:30 IST
నగరంలోని గిర్మాజిపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. విషం తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వరంగల్: నగరంలోని గిర్మాజిపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. విషం తాగి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో దంపతులు నవధాన్(33), స్రవంతి(28) మృతి చెందారు. పెద్దకొడుకు పరిస్థితి విషమంగా ఉంది. కొడుకును వరంగల్ ఎంజీఎంకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.