బొలేరో వాహనాన్ని ఢీకొన్న బైక్
ABN , First Publish Date - 2022-05-31T01:02:19+05:30 IST
బొలేరో వాహనాన్ని ఢీకొన్న బైక్
కరీంనగర్: జిల్లాలోని చింతకుంటలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనాన్ని ఢీకొన్న బైక్ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మృతులు చందు, మహేష్బాబుగా గుర్తించారు. స్థానికులు సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అడిగితెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుతున్నారు.