తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్
ABN , First Publish Date - 2022-10-04T00:42:47+05:30 IST
తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్ ఇచ్చింది. తెలంగాణకు రూ.3,800 కోట్లు జరిమానా ఎన్జీటీ విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలను, గతంలో తీర్పులను అమలు చేయకపోవడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు నెలల్లో రూ.3,800కోట్లు ప్రత్యేక అకౌంట్లో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. వ్యర్థాల నిర్వహణకు సత్వర చర్యలు చేపట్టి పురోగతిని తెలియజేయాలని ఎన్జీటీ ఆదేశించింది.