రిజర్వాయర్లో జారిపడి ముగ్గురు విద్యార్థులు మృతి
ABN , First Publish Date - 2022-08-13T23:25:27+05:30 IST
రిజర్వాయర్లో జారిపడి ముగ్గురు విద్యార్థులు మృతి
నల్లగొండ: జిల్లాలోని పీఏపల్లి మండలం అంగడిపేటలో విషాదఘటన చోటుచేసుకుంది. అక్కంపల్లి రిజర్వాయర్లో జారిపడి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు ఫార్మసీ విద్యార్థులు ఆకాష్, కృష్ణ, గణేష్గా గుర్తించారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.