TS News: ‘తప్పుడు ప్రచారంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిర్యాదు చేయాలి’

ABN , First Publish Date - 2022-12-19T18:22:05+05:30 IST

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పిర్యాదు చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు.

TS News: ‘తప్పుడు ప్రచారంపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిర్యాదు చేయాలి’

హైదరాబాద్: సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి పిర్యాదు చేయాలని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అన్నారు. సోషల్ మీడియా ప్రచారంపై పోలీసులు విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు తమకు అంతర్గత కలహాలు పెట్టడం సరికాదన్నారు. తప్పొప్పులు తెల్చాల్సిన అవసరం ఉందన్నారు. సమస్య వస్తే సమన్వయం చేయాల్సిన బాధ్యత ఏఐసీసీ సెక్రటరీలపై ఉందని ఆయన పేర్కొన్నారు. పార్టీలో ఉండి సీనియర్లను ఆధారాలు లేకుండా కోవర్టులు అనడం తప్పు అన్నారు. పీసీసీ, సీఎల్పీ నాయకుల తీరును ఏఐసీసీ గమనిస్తోందని తెలిపారు. భట్టి ఇంట్లో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్‌కు తనను కూడా పిలిచారని, కానీ బిజీగా ఉండటం వల్ల వెళ్లలేకపోయానని పేర్కొన్నారు.

Updated Date - 2022-12-19T18:22:08+05:30 IST