మల్లారెడ్డి ఆస్తులపై దాడి వ్యవహారంలో తాజా అప్ డేట్ ఏమిటంటే..?

ABN , First Publish Date - 2022-11-24T21:07:52+05:30 IST

తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) నివాసాలు, ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలంగా మారిన విషయం తెలిసిందే.

మల్లారెడ్డి ఆస్తులపై దాడి వ్యవహారంలో తాజా అప్ డేట్ ఏమిటంటే..?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మంత్రి మల్లారెడ్డి (Malla Reddy) నివాసాలు, ఆస్తులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం కలకలంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మంత్రి మల్లారెడ్డి, కుటుంబసభ్యుల బ్యాంక్ లాకర్ల కీస్‌ను ఐటీ తీసుకెళ్లిన్నట్లు తెలిసింది. రేపు లేదా ఎల్లుండి ఐటీ అధికారులు లాకర్లను ఓపెన్ చేయనున్నట్లు సమాచారం. అలాగే ఈ వారంలోనే మల్లారెడ్డి, కుటుంబసభ్యులను విచారించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రూ.15 కోట్ల నగదుకు సంబంధించిన పత్రాలు ఐటీ అధికారులు తీసుకెళ్లారు.

Updated Date - 2022-11-24T21:07:59+05:30 IST