యాదాద్రి థర్మల్ ప్లాంట్ దేశ ప్రతిష్టను పెంచుతుంది: కేసీఆర్
ABN , First Publish Date - 2022-11-28T20:57:41+05:30 IST
యాదాద్రి థర్మల్ ప్లాంట్ దేశ ప్రతిష్టను పెంచుతుందని సీఎం కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: యాదాద్రి థర్మల్ ప్లాంట్ దేశ ప్రతిష్టను పెంచుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. కార్పొరేట్ వ్యక్తులు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వ రంగంలోనే ప్రాజెక్టు ఉందన్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. 30 రోజులకు అవసరమైన బొగ్గు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాంట్లో రెండు యూనిట్లు వచ్చే ఏడాది డిసెంబర్లో పూర్తి కావాలని సీఎం సూచించారు.